అప్లయ్ చేసుకోండి : గురుకులంలో ప్రవేశాలు

అప్లయ్ చేసుకోండి : గురుకులంలో ప్రవేశాలు

దిల్ సుఖ్ నగర్, వెలుగు: సరూర్ నగర్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ లో 5వ తరగతి ప్రవేశానికి అప్లికేషన్ల స్వీకరణకు మార్చి 3న చివరి గడువు తేదీగా ఉందని స్కూల్ ప్రిన్సి పల్ తెలిపారు. ఎంట్రెన్స్ ఎగ్జా మ్ ఫీజు రూ.100గా నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుందన్నారు. ఎగ్జా మ్ కి అప్లయ్ చేసుకునే స్టూడెంట్స్ ఆధార్ కార్డు, ఫొటో, తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు, సంతకం, బోనఫైడ్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. గుర్తింపు పొందిన స్కూల్ నుంచి 4వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే ఈ గురుకుల స్కూల్ లో ప్రవేశాలకు అప్లయ్ చేసుకోవాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ 1 సెప్టెంబర్ 2006 నుంచి 31 ఆగస్టు 2010 మధ్య జన్మించి ఉండాలని..బీసీ, ఓసీ స్టూడెంట్స్ 1 సెప్టెంబర్ 2008 నుంచి 31 ఆగస్టు 2010 మధ్య పుట్టిన వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలన్నారు. tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలన్నారు.