పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్ట్ కు నివేదిక సమర్పించిన విద్యాశాఖ

పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్ట్ కు నివేదిక సమర్పించిన విద్యాశాఖ

పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు తెలంగాణ విద్య శాఖ నివేదిక సమర్పించింది. నివేదికలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచినట్లు తెలిపిన విద్యా శాఖ అధికారులు.. విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదని చెప్పింది. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చామని, కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండేలా అన్నీ పరీక్ష కేంద్రాలకు థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు పంపినట్లు తెలిపింది. ఇక కేంద్రానికి ఒకరు చొప్పున 4535 మంది వైద్య సిబ్బంది, డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు,  జీహెచ్ఎంసీ పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన విద్యాశాఖ … రెడ్  జోన్లలో పదోత తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నది.  ఒక్కో విద్యార్థి మధ్య 5,6 అడుగులు దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తూ .. వ్యాధి నిరోధ శక్తిని పెంచే మందులు సరఫరా చేయాలని ఆయుష్ విభాగాన్ని కోరినట్లు తెలంగాణ విద్యాశాఖ హైకోర్ట్ కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.