ఫామ్ హౌస్ వివాదంలో కేటీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై.. బుధవారం జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణకు జరిపారు.
ఈ సందర్భంగా ఎంపీ రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది …ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరారు. పిటిషన్లో అనేక అంశాలపై విచారణ జరపాల్సి ఉందని సీజే స్పష్టం చేశారు. త్వరలో తాను బదిలీ కానున్నందున ఇప్పుడు సమయం సరిపోదని పేర్కొంటూ .. పిటిషన్పై విచారణ జనవరి 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీజే తెలిపారు. కాగా.. ఫామ్హౌజ్పై మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.