తెలంగాణలో గో సంరక్షణ చట్టం అమలును వివరించండి : హైకోర్టు

తెలంగాణలో  గో సంరక్షణ చట్టం అమలును వివరించండి : హైకోర్టు
  • రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గోవధ నిరోధక, జంతు సంరక్షణ చట్టం అమలుపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. గోవధ నిషేధ చట్టం అమలు చర్యలపై కౌంటర్లు దాఖలు చేయాలంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గోవధ నిరోధక, జంతు సంరక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వరల్డ్‌‌ హిందూ ఫెడరేషన్‌‌ ఇండియా తరఫున జాతీయ అధ్యక్షుడు ఆషూ మోంగియా హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిని జస్టిస్‌‌ కె. శరత్‌‌ బుధవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బక్రీద్‌‌ పండుగ సందర్భంగా అక్రమంగా గోమాంసం రవాణా చేసే అవకాశం ఉందని తెలిపారు. గోసంరక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని, చర్య తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.