స్వైన్ఫ్లూ, డెంగీ నియంత్రణలో ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: స్వైన్ఫ్లూ, డెంగీ వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ప్రభుత్వం ఏ మేరకు సాయం తీసుకుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్కు చెందిన డాక్టర్ కరుణ వేసిన పిల్తో పాటు, లాయర్ రాపోల్ భాస్కర్ రాసిన లేఖను పిల్గా స్వీకరించి హైకోర్టు విచారించింది. ఆ వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రైవేటు హాస్పిటల్స్ను ఏ మేరకు భాగస్వాము లను చేసిందో చెబుతూ కౌంటర్ వేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చీఫ్ జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ అభిషేక్రెడ్డిల కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.