ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రిజల్ట్స్ లో 49శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం 4లక్షల 59వేల 242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా,.. 2లక్షల 24వేల 12మంది పాస్ అయ్యారు. గర్ల్స్ లో 56శాతం, బాయ్స్ లో 42శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా సడన్ గా ఫలితాలు విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. పరీక్షలు రాసిన వారిలో 51శాతం ఫెయిల్ అయ్యారు. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్సైట్లో లాగిన్ అవొచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.