
- 64 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతులు
హైదరాబాద్, వెలుగు: రోడ్లు భవనాల శాఖ లో 64 మంది డిప్యూటీ ఈఈలకు ఈఈ లుగా ప్రమోషన్లు ఇస్తూ ఆర్ అండ్ బీ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన ఇంజనీర్లు ప్రస్తుత పోస్ట్ లోనే కొనసాగాలని ఉత్తర్వులుల్లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్లు పొందిన ఇంజనీర్లకు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఏ శాఖలో లేని విధంగా ప్రత్యేకంగా రోడ్లు భవనాలు శాఖలో ప్రమోషన్స్, పోస్టింగ్స్ ఇప్పించానని తెలిపారు. సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం, తాను ఇంజనీర్లపై ఉంచిన నమ్మకాన్ని నిల బెడుతూ ఆ స్థాయిలో ప్రజల మన్ననలు పొం దేలా రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు పనిచేయాలని ఆదేశించారు.