సర్వర్ డౌన్.. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు

సర్వర్ డౌన్.. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ అయిందని చెబుతున్నారు అధికారులు. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు ఆగిపోయినట్లు సమాచారం.  దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆధార్ ఈ కేవైసీ సర్వర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఉదయం నుంచి భూముల  రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన క్రయ విక్రయదారులు ఆఫీస్ బయట పడిగాపులు కాస్తున్నారు.

అటు జగిత్యాల జిల్లా కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సాంకేతిక సమస్యతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో భూములు కొనుగోలు, అమ్మకాలు జరిపే వాళ్లు పడిగాపులు కాస్తున్నారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ సబ్- రిజిస్టార్ కార్యాలయంలో భూముల క్రయ విక్రయ సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 11న పొద్దున నుంచి సర్వర్ డౌన్ తో  సేవలు ఆగిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ వెరిఫికేషన్ ఆగిపోవడంతో 20 డాక్యుమెంట్స్ ఆగిపోయాయి. ఉద్యోగానికి సెలవు పెట్టి మరి ఉదయం నుండి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్నామని క్రయ విక్రయదారులు చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  కనీస వసతులు కూడా లేవన్నారు.