రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు ఎన్నంటే.. 

రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు ఎన్నంటే.. 

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా.. 2,387మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. జీహెచ్ఎంపీ పరిథిలో అత్యధికంగా 688 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి, సిరిసిల్ల జిల్లాలో 131 మంది చొప్పున కరోనా బారినపడ్డారు. వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు చనిపోయారు. గత 24 గంటల్లో 4,559 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 30,951గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,49,94,699 వ్యాక్సిన్ డోస్లు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

For more news..

కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది...రేవంత్ రెడ్డి

రేపు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని