తెలంగాణ ఆర్టీసీలో బదిలీలు

 తెలంగాణ ఆర్టీసీలో బదిలీలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. ఇద్దరు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంలు, 48 మంది డిపో మేనేజర్లు, జూనియర్​ స్కేల్​ ఆఫీసర్లను ట్రాన్స్‌‌‌‌ఫర్ చేస్తూ శనివారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు​ ఎం. రాజేశేఖర్‌‌‌‌‌‌‌‌ను ఐటీ అండ్ లీగల్ సెల్‌‌‌‌కు, సీహెచ్‌‌‌‌ కన్నను మెడికల్ విభాగానికి బదిలీ చేశారు. డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంలు బి. వెంకారెడ్డిని హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో డిప్యూటీ సీటీఎంగా, పి. జ్యోతిని నిజామాబాద్, ఎస్. మధుసూదన్‌‌‌‌ను మెదక్ ​, జి. జగన్‌‌‌‌ను మహబూబ్‌‌‌‌నగర్ డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంలుగా ట్రాన్స్​ఫర్ చేశారు.