చంద్రయాన్ 3 ల్యాండింగ్.. స్కూల్స్ టైమింగ్లో మార్పు

చంద్రయాన్ 3 ల్యాండింగ్.. స్కూల్స్ టైమింగ్లో మార్పు

చంద్రయాన్ 3 ఆగస్టు 23న  చంద్రుడిపై అడుగు పెట్టనుంది.  ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని లైవ్ చూసేలా  విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు, ప్రిన్సిపల్ కు  తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో  రేపు సాయంత్రం(ఆగస్టు 23) 5.20కి టీశాట్ ఛానల్ లో  లైవ్ టెలికాస్ట్ కానుంది.  అయితే సాధారణంగా స్కూళ్లు 4.45కి ముగుస్తాయి. కానీ లైవ్ కారణంగా రేపు  సాయంత్రం 6.30 గంటల వరకు స్కూల్స్ ఓపెన్  ఉటాయి. 

దేశంలోని విద్యార్థులందరు చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ చూసేల్ అన్ని విద్యా సంస్థలు ఏర్పాట్లు చేయాలన్న  ఇస్రో విజ్ఞప్తి మేరకు అన్ని  పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 కీలక దశకు చేరుకుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.