గోదావరిఖని, వెలుగు : బెంగుళూరులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్యకు గురైంది. నగరంలోని మేదరిబస్తీకి చెందిన ఆకాంక్ష(25) బెంగుళూరులోని కోడిహళ్లి ఏరియాలో ఫ్రెండ్తో కలిసి ఉంటోంది. ఆమె ఫ్రెండ్డ్యూటీకి వెళ్లి మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూడగా ఆకాంక్ష శవమై కనిపించింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి ప్లాట్ను పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె స్నేహితుడిగా అనుమానిస్తున్న ఢిల్లీకి చెందిన అర్పిత్కు సంబంధించిన సెల్ఫోన్, పర్స్ దొరికింది. ముఖంపై దిండుతో గట్టిగా అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత మెడకు తాడుతో ఉరివేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆకాంక్ష తండ్రి జ్ఞానేశ్వర్ది రాజస్తాన్ కాగా కొన్నేండ్లుగా గోదావరిఖనిలో ఉంటూ వ్యాపారం
చేస్తున్నాడు. బుధవారం ఆకాంక్ష డెడ్బాడీని గోదావరిఖనికి తీసుకురానున్నారు.