160 మంది టీచర్లకు షోకాజ్ నోటీస్ : విద్యా శాఖ అధికారులు

160 మంది టీచర్లకు షోకాజ్ నోటీస్ : విద్యా శాఖ అధికారులు

రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ టీజర్లకు రాష్ట్ర విద్యాశాఖ షాకిచ్చింది. 160 మంది టీచర్ల కు ఒకేసారి షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధికారులు. ఏప్రిల్ 15 నుంచి 26 వరకు కొనసాగనున్న SSC స్పాట్ వాల్యుయేషన్ కు హాజరు కావడం లేదనే కారణంతో అధికారులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నోటీసులు పంపారు. 24 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

హయత్ నగర్ లో జరుగుతున్న స్పాట్ వాల్యుయేషన్ కు రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు కొందరు హాజరు కాలేదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించే స్కూల్ అసిస్టెంట్ లకు నోటీసులు పంపామని అధికారులు వివరించారు. నోటీసులు సాధారణమే అయినా.. ఇంత మందికి ఒకేసారి నోటీస్ ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నారు ఉపాధ్యాయులు.