స్పామ్​ కాల్స్ ను ​రిసీవ్​ చేసుకోవద్దు: టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్​

స్పామ్​ కాల్స్ ను ​రిసీవ్​ చేసుకోవద్దు: టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్​

న్యూఢిల్లీ: గుర్తుతెలియని నంబర్లనుంచి వచ్చే ఫోన్​ కాల్స్​ను రిసీవ్​ చేసుకోవద్దని టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రజలను కోరారు. స్పామ్​ కాల్స్, సైబర్​ ఫ్రాడ్స్​ను నియంత్రించేందుకు తమ మంత్రిత్వశాఖ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

తమకు తెలిసిన, గుర్తించిన నంబర్ల నుంచి వచ్చే టెలిఫోన్, మొబైల్​ కాల్స్​కు మాత్రమే రెస్పాండ్​ అవ్వాలని ప్రతి పౌరుడిని కోరుతున్నట్లు కేంద్ర మంత్రి శుక్రవారం తెలిపారు. సైబర్​ నేరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్​ బదులిచ్చారు. స్పామ్​కాల్స్, సైబర్​ ఫ్రాడ్​లను అరికట్టేందుకు ‘సంచార్​ సాథీ’ పోర్టల్​ను ఇటీవల 
ప్రారంభించినట్లు వెల్లడించారు.