న్యూఢిల్లీ: గుర్తుతెలియని నంబర్లనుంచి వచ్చే ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకోవద్దని టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రజలను కోరారు. స్పామ్ కాల్స్, సైబర్ ఫ్రాడ్స్ను నియంత్రించేందుకు తమ మంత్రిత్వశాఖ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
తమకు తెలిసిన, గుర్తించిన నంబర్ల నుంచి వచ్చే టెలిఫోన్, మొబైల్ కాల్స్కు మాత్రమే రెస్పాండ్ అవ్వాలని ప్రతి పౌరుడిని కోరుతున్నట్లు కేంద్ర మంత్రి శుక్రవారం తెలిపారు. సైబర్ నేరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్ బదులిచ్చారు. స్పామ్కాల్స్, సైబర్ ఫ్రాడ్లను అరికట్టేందుకు ‘సంచార్ సాథీ’ పోర్టల్ను ఇటీవల
ప్రారంభించినట్లు వెల్లడించారు.