చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, లారీ ఓనర్ల మధ్య వాగ్వాదం

చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, లారీ ఓనర్ల మధ్య వాగ్వాదం

నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప-చిల్లే పల్లి టోల్ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పక్క జిల్లాలకు చెందిన దాదాపు 150 ధాన్యం లారీలను రాత్రి నుంచి చెక్ పోస్ట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పక్క జిల్లాలకు చెందిన ధాన్యాన్ని మిర్యాలగూడలో అమ్మడానికి వీలు లేదని పోలీసులు లారీలను అడ్డుకున్నారు. దీంతో లారీ ఓనర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధాన్యం లారీలను అడ్డుకోవడం అన్యాయమని లారీ ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చింది పచ్చి ధాన్యం అని, గోడౌన్ లకు తీసుకెళ్లకపోతే కుళ్లిపోయి పనిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని వేడుకున్నారు.