జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత..

జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత..

జనగామ జిల్లా తరిగొప్పల మండలం సోలిపురంలో ఉద్రిక్తత నెలకొంది.  భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ భూమిలో అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ వేస్తుండగా గొల్లకుర్మలు అడ్డుకున్నారు. దీంతో  ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో  దాడికి దిగారు. ఒకరిపై ఒకరు అక్కడున్న మట్టి పెళ్లలతో కొట్టుకున్నారు.  

ఈ దాడిలో పలువురి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. తరిగొప్పల జడ్పీటీసీ పద్మజ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.