వెస్ట్ బెంగాల్ ఏబీవీపీ ర్యాలీలో టెన్షన్

వెస్ట్ బెంగాల్ ఏబీవీపీ ర్యాలీలో టెన్షన్

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఏబీవీసీ ఆందోళన టెన్షన్ రేపింది. సెప్టెంబర్ 19న జాదవ్ పూర్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ బాబుల్ సుప్రియో వచ్చిన సందర్భంగా గొడవలు జరిగాయి. బాబుల్ సుప్రియోపై దాడి చేశారు కొందరు స్టూడెంట్స్. దీనికి నిరసనగా ఏబీవీపీ ఇవాళ ఆందోళనకు దిగింది.

దక్షిణ కోల్ కతాలోని గరియాహత్ ప్రాంతం నుంచి.. జాదవ్ పూర్ యూనివర్సిటీకి వెళ్లేందుకు భారీ స్థాయిలో ర్యాలీగా వచ్చారు విద్యార్థులు. వీరిని ముందుకు కదలనీయకుండా బారికేడ్లు కట్టి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో.. పోలీసులు నిలువరించేందుకు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.