సోమాలియాలో హోటల్ పై టెర్రర్ ఎటాక్..ఏడుగురు టెర్రరిస్టులు హతం

సోమాలియాలో హోటల్ పై టెర్రర్ ఎటాక్..ఏడుగురు టెర్రరిస్టులు హతం
  • ఏడుగురు టెర్రరిస్టులు హతం
  • ఆరుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు కూడా మృతి

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో అల్ కాయిదా అనుబంధ సంస్థ అల్ - షబాబ్ కు చెందిన టెర్రరిస్టులు దారుణానికి పాల్పడ్డారు. సముద్ర తీరంలో ఉన్న "పెరల్ బీచ్"  రెస్టారెంట్ పై ఎటాక్ చేశారు. భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య శుక్రవారం రాత్రి మొదలైన కాల్పులు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ముగిశాయి. ఆరు గంటల పాటు జరిగిన కాల్పుల్లో  ఏడుగురు టెర్రరిస్టులను హతమార్చారు.

టెర్రరిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఆరుగురు పౌరులు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. మరో 10 మంది గాయపడినట్లు చెప్పారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా 84 మందిని కాపాడినట్లు చెప్పారు. దాడి చేసింది తామేనని అల్-షబాబ్ సంస్థ ప్రకటించిందన్నారు.