జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని ఒక ఆస్పత్రిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరిగాయి.అయితే.. ఈ ఘటన నుంచి ఉగ్రవాదులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి వారు ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారు.
శ్రీనగర్ లోని బెమీనా ఏరియాలో ఉన్న SKIMS మెడికల్ కాలేజీ హాస్పిటల్ దగ్గర భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే రెస్పాండ్ అయిన బలగాలు... ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపాయి. కొద్దిసేపు ఫైర్ ఫైట్ జరిగింది. అయితే సాధారణ పౌరులను షీల్డ్ లా వాడుకుని... తప్పించుకున్నారు ఉగ్రవాదులు. వారికోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోందని శ్రీనగర్ పోలీసులు తెలిపారు.