ప్రొబెషనరీ ఎస్సైని కాల్చి చంపిన్రు

ప్రొబెషనరీ ఎస్సైని కాల్చి చంపిన్రు
  • శ్రీనగర్​లో టెర్రరిస్టుల దారుణం..  సీసీటీవీ కెమెరాలో రికార్డు

శ్రీనగర్: శ్రీనగర్​లో డ్యూటీలో ఉన్న ఓ ప్రొబెషనరీ సబ్​ఇన్​స్పెక్టర్​ను టెర్రరిస్టు వెనక నుంచి కాల్చి చంపాడు. ఈ దారుణం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని ఖాన్యార్ ఏరియా పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో నార్త్​కాశ్మీర్​కుప్వారా జిల్లాకు చెందిన అర్షిద్​ అహ్మద్ ప్రొబెషనరీ సబ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. ఖాన్యార్​ ఏరియాలో ఆదివారం తన టీమ్​తో కలిసి సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహిస్తున్నాడు. ఆ ఏరియాలో గాలిస్తుండగా.. మధ్యాహ్నం1.35 గంటల సమయంలో ఓ టెర్రరిస్టు అర్షిద్​ వెనక నుంచి వచ్చి రెండు సార్లు కాల్చాడు. వీపు భాగంలో బుల్లెట్లు దిగడంతో అహ్మద్ అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే ఆయనను స్కిమ్స్​ హాస్పిటల్​కు తరలించినా ఫలితం దక్కలేదు. రక్తం ఎక్కువగా పోవడంతో అహ్మద్​ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన ఆ ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాన్ని పరిశీలించిన పోలీసులు దాడికి పాల్పడిన టెర్రరిస్టును పట్టుకునేందుకు కార్డన్‌‌‌‌ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాశ్మీర్ పోలీసులు చెప్పారు. అహ్మద్ మృతిపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబ ముఫ్తీ, శ్రీనగర్ ​మేయర్, డీజీపీ దిల్బాగ్‌‌‌‌ సింగ్ సంతాపం తెలిపారు. అహ్మద్ పార్థివ దేహానికి కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆఫీసర్లు నివాళి అర్పించారు.