- టీజీవో కేంద్ర సంఘం నేతలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ చెప్పారు. ఆ ఆఫీసర్ పరువు, గౌరవానికి భంగం కలిగించేలా ఆ వార్తలు ఉన్నాయని ఆదివారం నేతలు పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఇలాంటి వార్తలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజనిజాలు తెలుసుకోకుండా, సంచలనాల కోసం మహిళా ఐఏఎస్ అధికారిపై అలాంటి వార్తలు ప్రసారం చేయడం బాధకరమని నేతలు వ్యాఖ్యానించారు. కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
