దసరా తిరుగు ప్రయాణానికీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా తిరుగు ప్రయాణానికీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: దసరా పండుగ తిరుగు ప్రయాణం నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన అసౌకర్యం తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు 1050 స్పెషల్ బస్సులను సంస్థ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందులో అత్యధికంగా వరంగల్ రీజియన్ నుంచి 229, కరీంనగర్ నుంచి 211, నల్గొండ నుంచి 137 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడిపినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. 

అలాగే  సోమవారం కూడా హైదరాబాద్ కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.