తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం :  తలసాని శ్రీనివాస్ యాదవ్

తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం :  తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఏంటో చూపించామని ఆ పార్టీ సనత్​నగర్ సెగ్మెంట్అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్​లోని వక్ఫ్​బోర్డ్, సెంట్రల్ వ్యూ అపార్ట్​మెంట్, బోయిగూడ, సున్నం బట్టీ, ఫ్లోరా హోటల్, కేటీఆర్ పార్క్ ఏరియాల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్​తో కలిసి ఆయన ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సనత్ నగర్​లో తన కంటే ముందు గెలిచిన  ఎమ్మెల్యేలు.. సీఎం, కేంద్రమంత్రులగా పనిచేసి కూడా జనాల సమస్యలను పరిష్కరించలేకపోయారని విమర్శించారు.

ఆయన వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్  ఇన్ చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నేతలు ఉన్నారు. సనత్ నగర్ డివిజన్​లోని శ్యామల కుంట, ఆదిత్య నగర్, ఉదయ్ నగర్, రవీందర్ నగర్, బాలయ్యనగర్ ఏరియాల్లో తలసాని శ్రీనివాస్ ప్రచారం చేశారు. కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. సనత్​నగర్ లోని జామా మసీదు జాఫ్రీ ప్రాంతంలో తలసాని శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్​లో సనత్ నగర్ సెగ్మెంట్ యువతతో ఏర్పాటు చేసిన  ఆత్మీయ సమ్మేళనానికి ఆయన చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు.