ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇండియా ఆత్మను గెలిపించారని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంతో ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
2014 జనరల్ ఎలక్షన్ల సమయంలో స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చారు. ఆ ఎలక్షన్లలో బీజేపీ తరఫున ప్రచార వ్యూహాలను అమలు చేసి మోడీ గెలుపునకు ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత కూడా పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో YCPకి పనిచేశారు. లేటెస్ట్ గా ఢిల్లీ ఎలక్షన్లలో అరవింద్ కేజ్రీవాల్ కు తోడుగా ఆప్ తరఫున ప్రచార వ్యూహాలు రూపొందించారు.
Thank you Delhi for standing up to protect the soul of India!
— Prashant Kishor (@PrashantKishor) February 11, 2020