TSRTC : సంక్రాంతికి ఆర్టీసీలో 1.21 కోట్ల మంది ప్రయాణం : సజ్జనార్‌

TSRTC : సంక్రాంతికి  ఆర్టీసీలో 1.21 కోట్ల మంది  ప్రయాణం : సజ్జనార్‌

సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గతేడాది సంక్రాంతితో పోలిస్తే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందిని సజ్జనార్‌ అభినందించారు. పండుగ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులను నడిపామని వెల్లడించారు. ముందుగా పండుగ రోజుల్లో 2,384 బస్సులను నడపాలని నిర్ణయించామని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లుగా సజ్జనర్‌ వివరించారు.  సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమ సంస్థను ఇలానే ప్రోత్సహించాలని కోరారు. 

ఇక పండక్కి సొంతూళ్లకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం దాదాపు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని సజ్జనార్‌ తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 212 ప్రత్యేక బస్సులు ఉన్నాయన్నారు. మంగళ, బుధవారాల్లో ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలలు ఆర్టీసీకి ఎంతో కీలకమన్న సజ్జనార్‌.. అధికారులందరూ బాగా పని చేయాలని ఆదేశించారు.