శ్మశానంలో చిన్నారి మృతదేహం మాయం

శ్మశానంలో చిన్నారి మృతదేహం మాయం

స్మశానవాటికలో చిన్నారి మృతదేహం మాయమైన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ పహాడీషరీఫ్‌‌లో పూడ్చి పెట్టిన మృతదేహం మాయమైంది. మృతదేహాన్ని ఎవరు, ఎందుకు తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. ఐదు రోజుల క్రితం తల్లి కడుపులోనే శిశువు చనిపోవడంతో శిశువు మృతదేహాన్ని తండ్రి స్థానిక స్మశాన వాటికలో పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంతో చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్నారి మృతదేహం మాయం కావడంపై పహడిషరీఫ్ పోలీసులు విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని జంతువులు తీసుకెళ్లినట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి డెడ్‌బాడీని జంతువులు లాక్కెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సరిగ్గా పూడ్చిపెట్టకపోవడం వల్లనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.