రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ డప్పుల మోతకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ డప్పుల మోతకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలంటూ డప్పుల మోత కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీజేపీ దళిత మోర్చా. బషీర్ బాగ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల మోత కార్యక్రమం జరగనుంది. దీంతో డప్పుల మోతలో పాల్గొనేందుకు బషీర్ బాగ్ చేరుకుంటున్నారు దళితులు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, కర్ణాటక BJP ఎంపీ మునుస్వామి, BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, SC మోర్చా నాయకులు డప్పుల మోతలో పాల్గొననున్నారు. 

బీజేపీ డప్పుల మోత కార్యక్రమానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. బషీర్ బాగ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే రిజెక్ట్ చేశారంటున్నారు దళితులు. సర్కార్ అనుమతి ఇవ్వకున్నా... తాము నిర్వహించి తీరుతామంటున్నారు దళితులు.