తెలంగాణకు 9 వేల కోట్ల అప్పుకు .. కేంద్రం గ్రీన్​సిగ్నల్

తెలంగాణకు 9 వేల కోట్ల అప్పుకు .. కేంద్రం గ్రీన్​సిగ్నల్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో వచ్చే ఆర్బీఐ బాండ్ల వేలంపాటలో రూ.2 వేల కోట్లను రాష్ట్రం తీసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్​కు సంబంధించి అప్పులు తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్​రెడ్డి.. అదనపు అప్పులపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రూ.15 వేల కోట్ల రుణం తీసుకునేందుకు సహకరించాలని కోరారు.