ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి..

 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో మూడు రోజులుగా హోటల్ లో ఉన్న రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచే నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో.. ఢిల్లీకి వెళుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే ఢిల్లీకి వెళ్లటం.. అది కూడా సీఎంగా ఖరారు అయిన తర్వాత.. పిలుపు రావటం ఆసక్తిగా మారింది.

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్న సమయంలో.. హైదరాబాద్ లో ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం.. ఈ పరిణామంలో ట్విస్ట్. 

మరో ఆసక్తికర అంశాన్ని తీసుకుంటే.. ఇప్పటికే ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీథర్ బాబుతోపాటు మరికొందరు సీనియర్లు అక్కడే ఉన్నారు. వాళ్లు ఢిల్లీలోనే ఉన్న సమయంలోనే.. రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించటం ఆసక్తిగా మారింది. మంత్రి వర్గం కూర్పుపైనే చర్చలు అనే ప్రచారం జరుగుతుంది. డిప్యూటీ సీఎం ఎవరు.. వాళ్లకు ఏ శాఖ కేటాయించాలి.. మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న వారికి.. ఎలాంటి శాఖలు ఇవ్వాలి అనే అంశాలపై రేవంత్ రెడ్డి సమక్షంలోనే.. కాంగ్రెస్ హైకమాండ్ చర్చించనున్నట్లు.. జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.