- జీవో 46 ను వెంటనే రద్దు చేయాలి
- పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు
ఖైరతాబాద్,వెలుగు : పాత పద్ధతిలోనే పోలీస్ నియామకాలు చేపట్టాలని కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో అభ్యర్థులు రఘు, కరుణకర్, రాజవర్ధన్, అనిల్, హరీశ్, గౌతమ్ మాట్లాడారు. జీవో 46తో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కేవలం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53 శాతం రిజర్వేషన్ కల్పించి, మిగతా 26 జిల్లాలకు 47 శాతం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 30కి పైగా మార్కులు సాధిస్తే వచ్చే ఉద్యోగం.. జిల్లాల గ్రామీణ అభ్యర్థులకు 130పైగా మార్కులు తెచ్చుకున్నా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 46 రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున పోటీ చేస్తామని హెచ్చరించారు. వీరికి తెలంగాణ ఉద్యమ కారుడు చెరుకు సుధాకర్ మద్దతు తెలిపారు.