
మహబూబాబాద్అర్బన్, వెలుగు: డబుల్బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వార్డు కౌన్సిలర్, తహసీల్దార్తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వేకువజామున ఫేస్బుక్లో లైవ్పెట్టి పురుగుల మందు తాగాడు. బాధితుడి ఫేస్బుక్ పోస్టుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొడ్రాల విజయ్(30) కారు డ్రైవర్. కులాంతర వివాహం చేసుకున్న విజయ్కు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల క్రితమే అతని తండ్రి యాక్సిడెంట్లో చనిపోగా, తల్లి రంగమ్మ అతని వద్దే ఉంటోంది. సొంతిల్లు లేని విజయ్ జిల్లాలోని గుమ్ముడూర్లోని నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇల్లు రాలేదు. దాంతో ‘‘నాకు సెంటు భూమి లేదు. కులాంతర వివాహం చేసుకున్నాను. తల్లి వితంతువు. అయినప్పటికీ నాకు డబుల్ బెడ్రూం కేటాయిండం లేదు. తహసీల్దార్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. ఇల్లు ఉన్నోళ్లు, డబ్బులున్నోళ్లకే ఇళ్లు కేటాయిస్తున్నారు. తహసీల్దార్ రంజిత్కుమార్, వార్డు కౌన్సిలర్ జనార్దన్, మరికొందరితో కలిసి ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడుతున్నారు” అంటూ ఐదు రోజుల క్రితం విజయ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దాన్ని తొలగించకపోతే చంపేస్తామంటూ తహసీల్దార్ రంజిత్ కుమార్, కౌన్సిలర్ జనార్దన్ ఫోన్చేసి బెదిరించారు. దాంతో విజయ్ మంగళవారం వేకువజామున ఫేస్బుక్ లైవ్పెట్టి జరిగింది వివరించాడు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోతున్నానని విజయ్ చెప్పాడు. తహసీల్దార్, వార్డు కౌన్సిలర్తన చావుకు కారణమని అందులో తెలిపాడు. ఆ వీడియో చూసిన విజయ్ఫ్రెండ్స్ అతని వద్దకు వెళ్లి మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి క్రిటికల్గా ఉందని అతని ఫ్రెండ్స్ తెలిపారు.