టీఆర్ఎస్ వైఫల్యాల పై తిరగబడే రోజు ఆసన్నమైంది

టీఆర్ఎస్ వైఫల్యాల పై తిరగబడే రోజు ఆసన్నమైంది
  • రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది.
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: టీఆర్ఎస్ వైఫల్యాల పై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందని దుబ్బాక బీజేపీ  ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆర్ఎస్ పార్టీ ముసుగులోని గూండాలు దాడి చేశాయని ఆరోపించిన ఆయన..దాడులను తీవ్రంగా ఖండించారు. మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ సర్కారు తీరుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
శాంతి భద్రతలను కాపాడటం లో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు. రైతులకు టీఆర్ఎస్  చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు ఆసన్నమైందన్నారు. పోలీసులు కేసీఆర్ సర్కారుకు భయపడి చేష్టలుడిగి చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు.