శంకర్ పల్లి, వెలుగు : తాజాగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్వైస్చైర్మన్వెంకట్రాంరెడ్డి, బీజేపీ కౌన్సిలర్లావణ్య మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, వికారాబాద్జడ్పీ చైర్పర్సన్సునీతారెడ్డి దంపతులను వారి ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని కాంగ్రెస్మాత్రమే అభివృద్ధి చేస్తుందని, కలిసొచ్చే వారిని కలుపుకుంటూ ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ చార్జ్ పామెన భీం భరత్సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరినది తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు భారీ షాక్తగిలింది. మండలాధ్యక్షుడు జనార్దన్రెడ్డి, నేతలు తౌఫిక్, ఎజాస్, ప్రవీణ్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.