కాంగ్రెస్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్సీ పట్నం

కాంగ్రెస్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్సీ  పట్నం

శంకర్ పల్లి, వెలుగు : తాజాగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్​వైస్​చైర్మన్​వెంకట్​రాంరెడ్డి, బీజేపీ కౌన్సిలర్​లావణ్య మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, వికారాబాద్​జడ్పీ చైర్​పర్సన్​సునీతారెడ్డి దంపతులను వారి ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని కాంగ్రెస్​మాత్రమే అభివృద్ధి చేస్తుందని, కలిసొచ్చే వారిని కలుపుకుంటూ ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు.  సోమవారం చేవెళ్ల కాంగ్రెస్ ​ఇన్ చార్జ్ పామెన భీం భరత్​సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్ కాంగ్రెస్​లో చేరినది తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మున్సిపాలిటీలో  బీఆర్ఎస్​ కు భారీ షాక్​తగిలింది. మండలాధ్యక్షుడు జనార్దన్​రెడ్డి, నేతలు తౌఫిక్​, ఎజాస్, ప్రవీణ్​, శ్రీశైలం తదితరులు ఉన్నారు.