
తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకమార్గంలోని గాలిగోపురం వద్ద ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భక్తుడు హైదరాబాద్కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్గా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాహుల్ విగతజీవిగా మారడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.