మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు : అత్యాచారయత్నం ప్రతిఘటించడంతోనే దారుణం

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు : అత్యాచారయత్నం ప్రతిఘటించడంతోనే దారుణం

హైదరాబాద్ : జల్ పల్లిలో  సంచలనం సృష్టించిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును ఛేదించారు పహాడి షరీఫ్ పోలీసులు. ఓ ఆటో డ్రైవర్ రాయితో ఆమె తలపై మోది చంపారని నిర్ధారించారు. హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం యత్నం చేశాడన్నారు పోలీసులు.

డిసెంబర్ 6న బండ్లగూడ మహ్మద్ నగర్ లోని తన ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కింది ఓ మహిళ. ఆటో డ్రైవర్ మహ్మద్ నగర్ కి వెళ్లకుండా రాంగ్ డైరెక్షన్ లో జల్ పల్లి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో బండ రాయితో తలపై మోది అక్కడి నుంచి పరారయ్యాడు. ముందుగా గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా హత్య కేసు మిస్టరీ ని ఛేదించారు.