సంగారెడ్డి జిల్లాలో కుటుంబాన్ని వెలేసిన గ్రామ పెద్దలు

సంగారెడ్డి జిల్లాలో కుటుంబాన్ని వెలేసిన గ్రామ పెద్దలు

ఆందోల్ : భూమి వివాదం విషయంలో కుల పెద్దల తీర్పును అంగీకరించలేదని ఓ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన నవాబు కృష్ణ కుటుంబానికి ఈ ఘోర అవమానం జరిగింది. ఓ భూమి గొడవలో మధ్యవర్తికి గాయాలు కావడంతో పంచాయతీలో గ్రామ పెద్దలు నవాబు కృష్ణకు రూ. 1లక్షా 50 వేల ఫైన్ వేశారు.

తనకు అన్యాయంగా పెద్ద మొత్తంలో జరిమానా వేశారని..డబ్బులు కట్టలేనని వారి తీర్పును తిరస్కరించాడు కృష్ణ. దీంతో కృష్ణ కుటుంబాన్ని వెలివేశారు గ్రామ పెద్దలు. పెద్ద మనుషులు, కుల పెద్దలు ఇచ్చిన తీర్పుతో మనస్తాపానికి గురైన కృష్ణ..తన ఫ్యామిలీతో వెళ్లి.. ఈ సంఘటన పై ఆందోల్ తహసీల్దార్ కు, పోలీసులకు పిర్యాదు చేశాడు. జిల్లా జడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ గ్రామంలోనే  నవాబు కృష్ణ కుటుంబం గ్రామ బహిష్కరణ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది..