ఇండిగో విమానంలో బాంబు కలకలం రేగింది. ఢిల్లీకి చెందిన ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని.. చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి.. తనిఖీలు చేపట్టారు. పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ లోని ప్యాసింజర్ తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ప్యాసింజర్లందర్నీ కిందకి దించారు విమాన సిబ్బంది. తర్వతా బాంబు స్క్వాడ్ సాయంతో ప్యాసింజర్ బ్యాగ్ చెక్ చేశారు.
180 passengers of Dubai-Cochin Air India flight diverted to Mumbai land in Kochi on alternate flight
— ANI Digital (@ani_digital) July 22, 2022
Read @ANI Story | https://t.co/v35sEPZfHD#DubaiCochin #AirIndia #Mumbai pic.twitter.com/FnrcRywgux
అలాగే ప్రొటోకాల్ ప్రకారం ఫ్లైట్ అంతా తనిఖీలు చేశాక.. బాంబు లేదని గుర్తించారు అధికారులు. బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్యాసింజర్ తన ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నాడని.. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ మానసిక స్థితి బాగాలేదని భావిస్తున్నారు అధికారులు. తనిఖీల తర్వాత విమాన ప్రయాణానికి అనుమతించారు.