హైదరాబాద్: సిటీలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని తాకుతూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పోలీసులు, సిబ్బంది మూసీ పరివాహక కృష్ణానగర్, తులసీరామ్నగర్, లంక బస్తీ, కమలానగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఉస్మాన్సాగర్ (గండిపేట) 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఓపెన్చేశారు. కిషన్బాగ్ పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందలు, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.