ఫ్రాన్స్లోని ఓవర్సీస్ టెరిటరీలో నివసించే ఒకామె తన దగ్గర ఉన్న ఒక పాత కుండీని వేలానికి పెట్టింది. బ్లూ కలర్లో, చైనీస్ ఆర్ట్ వేసిన పొడవాటి కుండీ అది. ఫ్రాన్స్లోని ‘ఒసినాట్ ఆక్షన్ హౌస్’ కు ఆ పూలకుండీ చేరింది. దాన్ని చూసిన ఒకతను అది18వ శతాబ్దానికి చెందింది అనుకుని బిడ్ మొదలుపెట్టాడు.
కాసేపట్లోనే అక్కడున్న 30 మంది దాన్ని వేలం పాడేందుకు పోటీ పడ్డారు. చివరికి ఒకతను రూ.61 కోట్లకు కొన్నాడు. వేలం ముగిశాక అదొక మామూలు కుండీ అని తెలిసింది. దాన్ని అతను నాలుగు వేల రెట్లు ఎక్కువ ధరతో కొన్నాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.