రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు

రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు

రెండో శనివారం సాధారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. కానీ ఈ నెలలోని రెండో శనివారంలో మాత్రం సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పింది. 

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీని ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఆ సెలవును భర్తీ చేసేందుకు రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12న సెలవు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.