హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని తెలిపింది.
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణేశ్ ఉత్సవాలు, నిమర్జనాలు చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా చూడాలని తెలిపింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు సూచనలు చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని తెలిపింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
