హైదరాబాద్, వెలుగు: ఒకే నోటిఫికేషన్ ఆధారంగా 2013, 2014 సంవత్సరాల్లో నియమితులైన మోడల్ స్కూల్ టీచర్ల మెరిట్ లిస్ట్ తయారీపై దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చేదాకా సీనియార్టీ లిస్ట్ ఖరారు చేయొద్దని జస్టిస్ నవీన్రావు, జస్టిస్ శ్రీనివాస్రావుల బెంచ్ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మోడల్ స్కూళ్లలో టీచర్ల భర్తీకి 2012లో నోటిఫికేషన్ వెలువడింది. 2013లో కొందరిని, 2014లో మరికొందరిని నియమించింది. సీనియార్టీ లిస్ట్ మాత్రం 2013లో నియమితులైన వాళ్లతో తయారు చేయడం అన్యాయమంటూ హైకోర్టులో రిట్లు దాఖలయ్యాయి. ఒకే నోటిఫికేషన్ కింద నియమితులైన వాళ్లలో కొందరినే సీనియార్టీకి ఎంపిక చేయడం సరికాదని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.