ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది : గడ్డం వంశీ కృష్ణ

ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది : గడ్డం వంశీ కృష్ణ

తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు కాకా అని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం తపించిన మనిషి అని తెలిపారు. చిన్నప్పటి నుండి కాకా అడుగు జాడల్లో పెరిగినని అధికారంలో ఉన్నా లేకున్నా ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కాకా ప్రాణహిత చేవెళ్లకు మార్గం సుగమం చేస్తే కేసీఆర్ ఇంజినీర్ అవతారమెత్తి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ధనం దోచుకున్నాడని ఆరోపించారు. ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

గత పదేళ్ల ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. తనకున్న అనుభవంతో కేంద్రం నుండి ప్రభుత్వ సంస్థలు తెచ్చి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు అడుగుజాడల్లో నడిచి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు గడ్డం వంశీ కృష్ణ.