ఐదేళ్లుగా కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారుల తీరు ఇది
జీడిమెట్ల, వెలుగు: ఇల్లు ఒక్కటే.. కానీ రెండు బిల్లులు. ఇది కుత్బుల్లాపూర్సర్కిల్ అధికారుల తీరు. దీంతో ఇస్టానుసారంగా ప్రాపర్టీ ట్యాక్స్లు వేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంటికి రెండు వేర్వేరు ట్యాక్స్లు వేశారు. సూరారం కాలనీకి చెందిన రిటైర్డ్హెడ్మాస్టర్ఈశ్వరయ్యకు అదేకాలనీలో ప్రాపర్టీ ఉంది. 5 ఐదేళ్లుగా అతనికి రెండు విధాలుగా ప్రాపర్టీ ట్యాక్స్విధిస్తున్నారు. ఒకటి కమర్షియల్, మరొకటి రెసిడెన్షియల్. దీనిపై ఆయన, కుమారులు కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. దీంతో ఆదివారం నిర్వహించిన ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార వేదికలో కంప్లయింట్ చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు.