- ఉప్పల్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన
ఉప్పల్, వెలుగు : ఆర్సీబీ వర్సెస్ఎస్ఆర్హెచ్క్రికెట్మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ లో అమ్ముకున్నారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు గురువారం ఉప్పల్క్రికెట్స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు. స్టేడియం మెయిన్గేట్వద్ద దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సాట్చైర్మన్శివసేనారెడ్డి మాట్లాడుతూ.. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూళ్ల యాజమాన్యంతో బ్లాక్లో టిక్కెట్లు అమ్మిస్తున్నాడని ఆరోపించారు. కాంప్లిమెంటరీ పాసులను పైసలకు విక్రయిస్తున్నాడని చెప్పారు.
హెచ్సీఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని, టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రావు ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాడని, వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నాడని మండిపడ్డారు. క్లబ్ మెంబర్స్ టికెట్లను ఎగ్గొడుతున్నాడన్నారు. ఉప్పల్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉప్పల్యూత్కాంగ్రెస్అధ్యక్షుడు అరుణ్పటేల్, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.