ఐపీఎల్​ టికెట్లు బ్లాక్​లో అమ్ముతున్రు

ఐపీఎల్​ టికెట్లు బ్లాక్​లో అమ్ముతున్రు
  • ఉప్పల్ స్టేడియం వద్ద యూత్​ కాంగ్రెస్​ నేతలు ఆందోళన

ఉప్పల్, వెలుగు : ఆర్సీబీ వర్సెస్​ఎస్ఆర్​హెచ్​క్రికెట్​మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ లో అమ్ముకున్నారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు గురువారం ఉప్పల్​క్రికెట్​స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు. స్టేడియం మెయిన్​గేట్​వద్ద దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సాట్​చైర్మన్​శివసేనారెడ్డి మాట్లాడుతూ.. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూళ్ల యాజమాన్యంతో బ్లాక్​లో టిక్కెట్లు అమ్మిస్తున్నాడని ఆరోపించారు. కాంప్లిమెంటరీ పాసులను పైసలకు విక్రయిస్తున్నాడని చెప్పారు.

హెచ్​సీఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని, టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రావు ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాడని, వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్​లో విక్రయిస్తున్నాడని మండిపడ్డారు. క్లబ్ మెంబర్స్ టికెట్లను ఎగ్గొడుతున్నాడన్నారు. ఉప్పల్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉప్పల్​యూత్​కాంగ్రెస్​అధ్యక్షుడు అరుణ్​పటేల్, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.