
హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఐమ్యాక్స్ థియేటర్ ముందు రివ్యూ తీసుకోవడాన్ని నిషేదిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల రివ్యూల కోసం న్యూస్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ అన్నీ ఐమాక్స్ థియేటర్ దగ్గరకు వెళ్లడం గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. దీంతో ఆ ప్రాంతం అంతా న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని గ్రహించిన ఐమ్యాక్స్ యాజమాన్యం.. థియేటర్ ముందు రివ్యూస్ తీసుకోవడాన్ని నిషేధించింది.
ఫ్రీగా పాపులారిటీ వస్తుందనే ఉద్దేశంతో.. చాలామంది కావాలనే థియేటర్ ముందు అల్లరి చేస్తున్నారు. చాలా కాలంగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ గోలను తట్టుకోవడం థియేటర్ యాజమాన్యం వల్ల కాలేదు. అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ టైంలో ఏకంగా కొట్టుకునే వరకు వెళ్ళింది. దీంతో.. ఇక మీదట ఈ న్యూసెన్స్ ను భరించకూడదని నిర్ణయించుకున్న ప్రసాద్ యాజమాన్యం.. ధియేటర్ ఎదుట, పరిసరాల్లో రివ్యూలు తీసుకోవటం, ఆడియన్స్ అభిప్రాయం తీసుకోవటం నిషేధిస్తూ.. చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో నెటిజెన్లు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.