హోటల్ మేనేజ్​మెంట్ స్టూడెంట్ ఆత్మహత్య

హోటల్ మేనేజ్​మెంట్ స్టూడెంట్ ఆత్మహత్య

ఎల్​బీనగర్, వెలుగు : లాడ్జిలో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన సరూర్​నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్​నగర్ జిల్లా బండమీదిపల్లికి చెందిన పవన్(21) సిటీలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. పవన్ మంగళవారం రాత్రి దిల్​సుఖ్ నగర్ లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రూమ్​లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పవన్ రాసిన సూసైడ్ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

మద్యానికి బానిసై ఆటోడ్రైవర్..

మాదాపూర్: ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్న ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఏనగర్​లో ఉండే కె. వేణు(42) ఆటో డ్రైవర్​. నాలుగు నెలలుగా మద్యానికి బానిసై ఆటో కూడా నడపకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అతడి భార్య కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో  వేణు ఫ్యాన్​కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న మియాపూర్​ పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్​బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.