హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న 'గాడ్సే' మూవీ విడుదల తేదీ మారింది. జూన్ 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. నిజానికి ఈ సినిమాను ముందుగా మే 20వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. 'ఈ మూవీకి గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో 'బ్లఫ్ మాస్టర్' వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న 'గాడ్సే' సినిమాపై టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్తో భారీ అంచనాలు పెరిగాయి.
'గాడ్సే'ను డైరెక్ట్ చేయటంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, మాటలను కూడా గోపి గణేష్ అందిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న ఐశ్వర్య లక్ష్మికి తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో నాగబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.
మొదటి నుంచి కూడా హీరో సత్యదేవ్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. 'బ్రోచేవారెవరురా', 'రాగల 24 గంటల్లో' సినిమాలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. చిరంజీవి సినిమా 'ఆచార్య'లో ఒక చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన సత్యదేవ్ 'గాడ్ ఫాదర్' సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు.
Only the date has changed. Not the cause.
— Satya Dev (@ActorSatyaDev) May 18, 2022
Godse from June 17, 2022. #GodseOnJune17
@MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/cuS9SM61XX
మరిన్ని వార్తల కోసం..