దేశంలో కరోనా టెస్టులు 9 కోట్లు.. కేసులు 72 లక్షలు

దేశంలో కరోనా టెస్టులు 9 కోట్లు.. కేసులు 72 లక్షలు

దేశంలో కొత్తగా 63,509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 72,39,390 కు చేరాయి. నిన్న730 మంది మరణించడంతో కోవిడ్ మరణాల సంఖ్య1,10,586 కు చేరింది. నిన్న ఒక్కరోజే 74,632 మంది రికవరీ అయ్యారు. దీంతో దేశంలో నిన్నటి వరకు కరోనా నుంచి 63,01,928 మంది కోలుకున్నారు. ఇంకా 8,26,876 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా రికవరీ 87.05 శాతం ఉండగా..డెత్ రేట్ 1.53 శాతం, ఆక్టివ్ కేసులు 11.42 శాతంగా  ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నిన్న ఒక్కరోజే 11 లక్షల 45 వేల 15 శాంపిల్స్ టెస్ట్ చేశారు. దీంతో నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య 9కోట్ల90 వేల122 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.