షాపింగ్ మాల్స్ పై కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

షాపింగ్ మాల్స్ పై కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు షాపింగ్ మాల్స్ పై ఆదాయపు పన్ను(ఐటీ) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అయిదు రోజుల సెర్చ్ వారెంట్ తో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.  ఇదివరకు జూబ్లీహిల్స్ లోని వరమహాలక్ష్మీ షాపింగ్ మాల్ లో 8 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం ఐటీ చెల్లింపులపై ఆరా తీసింది.  ఆయా సంస్థల ఫైనాన్స్ మేనేజర్లను సైతం విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కస్టమర్లను అనుమతించని పోలీసులు

కాగా పలు చోట్ల షాపింగ్ మాల్ లోకి వస్తున్న కస్టమర్లను పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. ఫిలింనగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న కళామందిర్ గ్రూప్స్, కేఎల్ఎం, కాంచీపురం వాటి అనుబంధ వ్యాపార సంస్థల లావాదేవీలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.